జీవో నెంబర్ 1: తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

By narsimha lodeFirst Published Jan 24, 2023, 4:16 PM IST
Highlights

జీవో నెంబర్  1పై  తీర్పును  ఏపీ హైకోర్టు  రిజర్వ్ చేసింది.   జీవో నెంబర్  పై  నిన్న, ఇశాళ కూడ  ఏపీ హైకోర్టు  వాదనలను విన్నది.  


హైదరాబాద్: జీవో నెంబర్  1పై   తీర్పును ఏపీ హైకోర్టు  రిజర్వ్ చేసింది.  జీవో నెంబర్ పై  ఇరువర్గాల వాదనలను హైకోర్టు  విన్నది.రోడ్లపై రోడ్ షోలు,  సభలు, సమావేశాలు , నిర్వహించడాన్ని నిషేధిస్తూ  ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని  ఈ నెల  రెండో తేదీన తీసుకు వచ్చింది. జీవో నెంబర్  1ని సవాల్ చేస్తూ  ఈ నెల  12న  సీపీఐ ఏపీ రాస్ట్ర సమితి కార్యదర్శి  రామకృష్ణ వెకేషన్ బెంచ్ లో  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ విచారించిన  ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్  జీవో నెంబర్  1ని ఈ నెల  23వ తేదీ వరకు సస్పెండ్  చేసింది.   నిన్న ఏపీ హైకోర్టు  సీజే ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణ చేసింది. ఇదే సమయంలో  ఈ పిటిషన్ పై   టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు ఇంప్లీడ్  అయ్యాయి.  

ఈ పిటిషన్ ను వెకేషన్ బెంచ్  విచారించడంపై  ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం  కీలక వ్యాఖ్యలు చేసింది.  వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్   విచారించడంపై  ఆగ్రహం వ్యక్తం  చేసింది. 
 జీవో నెంబర్  1పై  సస్పెన్షన్ ను కొనసాగింపునకు  పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్ధించారు. అయితే  సస్పెన్షన్ ను  కొనసాగించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్  పై  ఇంప్లీడ్ అయిన పిటిషన్లపై  ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.  జీవో నెంబర్  1ని సస్పెండ్  చేయాలని  టీడీపీ తరపు న్యాయవాది  వాదించారు. జీవో నెంబర్  1ని సస్పెండ్  చేసేందుకు  హైకోర్టు నిరాకరించింది.

also read:జీవో నెంబర్ 1 సస్పెన్షన్ కొనసాగింపునకు ఏపీ హైకోర్టు నిరాకరణ: విచారణ రేపటికి వాయిదా

గత ఏడాది డిసెంబర్  28వ తేదీన  కందుకూరులో,  ఈ నెల 1 వ తేదీన గుంటూరులో జరిగిన  తొక్కిసలాటల్లో  11 మంది మృతి చెందారు.   భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా  ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము  జీవో నెంబర్  1ని తీసుకు వచ్చినట్టుగా  వైసీపీ ప్రకటించింది.   విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే   ప్రభుత్వం ఈ జీవోను తీసుకు వచ్చిందని విపక్షాలు విమర్శించాయి. 

 
 

click me!