బిల్డ్ పిటిషన్ పై విచారణ:ఏపీ హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Dec 21, 2020, 3:04 PM IST
Highlights

మిషన్ బిల్డ్  పిటిషన్ పై తాను విచారణ కొనసాగించాలో విచారణ నుండి తప్పుకోవాలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పారు.
 


అమరావతి: మిషన్ బిల్డ్  పిటిషన్ పై తాను విచారణ కొనసాగించాలో విచారణ నుండి తప్పుకోవాలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పారు.

మిషన్ బిల్డ్ పై  దాఖలైన పిటిషన్ పై విచారణ నుండి తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ విషయమై జస్టిస్ రాకేష్ కుమార్ స్పందించారు.

ఈ పిటిషన్ పై తాను విచారణ చేయాలో వద్దో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.

రాగద్వేషాలకు అతీతంగా వ్యవస్థ కోసం తాను పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 28న విచారణ చేస్తానని ఆయన చెప్పారు. తన కెరీర్ చివర్లో ఇలాంటి పిటిషన్ చూస్తాననుకోలేదన్నారు.

మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో ప్రభుత్వ భూములను విక్రయించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విచారణ నుండి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

రాష్ట్రంలోని గుంటూరు, విశాఖపట్టణంతో పాటు 9  ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాన్ని ఈ వేలం ద్వారా విక్రయించాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది. 

జస్టిస్ రాకేష్ కుమార్ విచారణ నుండి తప్పుకోవాలని  మిషన్ ఆఫ్ ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

click me!