వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు

Published : May 21, 2019, 05:21 PM IST
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు

సారాంశం

ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

అమరావతి:  ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

ఈవీఎంల కంటే ముందే  వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై మంగళవారం నాడు జస్టిస్ శ్యాం ప్రసాద్ విచారించారు. నాలుగు గంటల పాటు ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.

ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయమై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే  కౌంటింగ్ ఉంటుందని ఈసీ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఈసీ తరపు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు మాట్లాడుతుండగా సొమ్మసిల్లి పడిపోయిన కమాండో | Commando Collapses | Asianet News Telugu
Miss India 2020 Manasa Varanasi Visit Tirumala:తిరుమలలో మిస్ ఇండియామానస వ‌రణాసి| Asianet News Telugu