పరిపాలనా రాజధానిగా విశాఖ: వీఎంఆర్డీఏలోకి 13 మండలాలు.. పెరిగిన నగర పరిధి

Siva Kodati |  
Published : Mar 23, 2021, 07:52 PM IST
పరిపాలనా రాజధానిగా విశాఖ: వీఎంఆర్డీఏలోకి 13 మండలాలు.. పెరిగిన నగర పరిధి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేసేందుకు గాను పరిపాలనా యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేసేందుకు గాను పరిపాలనా యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) పరిధిలోకి ఆ జిల్లాలోని మరో 13 మండలాలను చేరుస్తూ పురపాలకశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 13 మండలాల్లోని 431 గ్రామాలను వీఎంఆర్డీఏలోకి విలీనం చేస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి నోటిఫికేషన్ విడుదల చేశారు.  

నర్సీపట్నం, నాతవరం, బుచ్చయ్యపేట, చీడికాడ, రోలుగుంట, గొలుగొండ, కోటవురట్ల, మాకవరపాలెం, దేవరాపల్లి, కె.కోటపాడు, రావికమతం, మాడుగుల, చోడవరం మండలాలను వీఎంఆర్డీఏలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త మండలాల్లోని 2,028,19 హెక్టార్ల భూమి చేరికతో వీఎంఆర్డీఏ పరిధి 7,328 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!