బడ్జెట్‌పై జగన్ సర్కార్ కసరత్తు: మంత్రులతో బుగ్గన భేటీ

Siva Kodati |  
Published : Jul 01, 2019, 12:09 PM IST
బడ్జెట్‌పై జగన్ సర్కార్ కసరత్తు: మంత్రులతో బుగ్గన భేటీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌పై వైఎస్ జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో విడి విడిగా సమావేశమవ్వనున్నారు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌పై వైఎస్ జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో విడి విడిగా సమావేశమవ్వనున్నారు. ఇవాళ, రేపు ఆయన పలు శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తారు. సోమవారం 12 శాఖలపై విడివిడిగా చర్చలు జరపనున్నారు.

ఈ సమావేశానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పేర్నినాని, కన్నబాబు, మోపిదేవి వెంకట రమణ, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, తానేటి వనిత, ఆళ్లనాని, జయరాం, విశ్వరూప్, పుష్ప శ్రీవాణి, శ్రీరంగనాథరాజు హాజరుకానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు | Asianet News Telugu
Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu