ఐఎఎస్ అధికారులపై ఎస్ఈసీ ప్రొసిడింగ్స్: తిప్పి పంపిన సర్కార్

Published : Jan 27, 2021, 05:19 PM IST
ఐఎఎస్ అధికారులపై ఎస్ఈసీ ప్రొసిడింగ్స్: తిప్పి పంపిన సర్కార్

సారాంశం

ఐఎఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ పై ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసిడింగ్స్ ను రాష్ట్రప్రభుత్వం తిప్పి పంపింది.

అమరావతి: ఐఎఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ పై ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసిడింగ్స్ ను రాష్ట్రప్రభుత్వం తిప్పి పంపింది.ఎన్నికల విధులకు పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది,, కమిషనర్ గిరిజా శంకర్ లు అనర్హులంటూ ఎస్ఈసీ ఈ నెల 26వ తేదీన ప్రొసిడింగ్స్ జారీ చేశారు.

also read:ఎన్నికల విధులకు అనర్హులు: గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌పై ఎస్ఈసీ సంచలనం

2021 ఓటర్ల జాబితా తయారీ ఆలస్యానికి ఈ ఇద్దరు కారణమని  కూడ ఈ ప్రొసిడింగ్స్ లో ఎస్ఈసీ అభిప్రాయపడింది. ఈ ప్రొసిడింగ్స్ ను ప్రభుత్వానికి పంపింది ఎస్ఈసీ.

అయితే ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసిడింగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపింది. అధికారుల నుండి వివరణ తీసుకోకుండానే ప్రొసిడింగ్స్ ను ఎవరూ జారీ చేయలేరని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు  ఈ ప్రొసిడింగ్స్ ను తిప్పి పంపుతూ  కారణాలను పేర్కొంటూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పంపారు. 

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు సెన్సూర్ ప్రొసిడింగ్స్ ను ఎస్ఈసీ పంపింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్