కొత్త కులాలు ఎస్టీల్లో చేర్చేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

Published : Sep 05, 2019, 01:23 PM IST
కొత్త కులాలు ఎస్టీల్లో చేర్చేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

సారాంశం

కొన్ని కులాలను ఎస్టీల్లో చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేసేందుకు ప్రయత్నాలు చేసింది.


బేడ, బుడిగ జంగాలు, ఎస్టీల్లో చేర్చే విషయమై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జేపీ శర్మ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. బెంతో ఒరియా కుల ధృవీకరణ పత్రాల జారీ అంశాన్ని కూడ ఈ కమిషన్ పరిశీలించనుంది. 

ఎన్నికల సమయంలో  వైఎస్ జగన్ ఇచ్చిన హమీ మేరకు బుడిగ జంగాలు, బేడ కులాలను ఎస్టీల్లో చేర్చే విషయాన్ని జగన్ సర్కార్ పరిశీలిస్తోంది. ఈ విషయమై ఏకసభ్య కమిషన్ ను నియమించింది.  ఈ కమిషన్‌కు విధి విధానాలను నిర్ణయిస్తూ జీవోను విడుదల చేశారు.
 

PREV
click me!

Recommended Stories

పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే