ఏపీ రాజకీయాల్లో భారీ కుదుపు, చంద్రబాబుతో సహా 150 గల్లంతే: మాజీమంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు

Published : Jun 26, 2019, 10:12 AM IST
ఏపీ రాజకీయాల్లో భారీ కుదుపు, చంద్రబాబుతో సహా 150 గల్లంతే: మాజీమంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

2024 లోపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా 150 మంది కీలక రాజకీయ నేతలు కనుమరుగు అయ్యే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నేతలు సైతం బీజేపీలో చేరతారని తెలిపారు.   

తాడేపల్లి గూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో ఓ కుదుపు రాబోతుందని మాజీమంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయిపోయే అవకాశం ఉందన్నారు. 

2024 లోపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా 150 మంది కీలక రాజకీయ నేతలు కనుమరుగు అయ్యే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నేతలు సైతం బీజేపీలో చేరతారని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం దిశగా ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఏపీలో యువత బీజేపీవైపు ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావడంతోపాటు బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా మారబోతుందని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu