ఇసుక, మద్యం అక్రమ రవాణా..ఎవరైనా సరే వదలొద్దు: అధికారులకు జగన్ ఆదేశం

By Siva KodatiFirst Published Sep 8, 2020, 6:11 PM IST
Highlights

స్పందన కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేవారు ఎవరైనా సరే వదలొద్దని స్పష్టం చేశారు.

స్పందన కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేవారు ఎవరైనా సరే వదలొద్దని స్పష్టం చేశారు.

ఈ అంశాల్లో ఎవరిని ఉపేక్షించొద్దన్న జగన్.. అక్రమ పనులు ఏవైనా అస్సలు ఊరుకోవద్దని ఆదేశించారు. ఈ విషయంలో తాను అండగా ఉంటానని అధికారులకు హామీ ఇచ్చారు జగన్.

ఎరువుల సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కొన్ని జిల్లాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

click me!