గ్రామ సచివాలయం ఫలితాలు విడుదల

Published : Sep 19, 2019, 02:52 PM ISTUpdated : Sep 19, 2019, 02:55 PM IST
గ్రామ సచివాలయం ఫలితాలు విడుదల

సారాంశం

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన పరీక్షలు సెప్టెంబర్ 8 వరకు అంటే వారం రోజులపాటు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 19 లక్షల 74వేల మంది హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 19 రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. 

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన గ్రామ సచివాలయం పరీక్ష ఫలితాలను విడదుల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఫలితాలను విడుదల చేశారు. 

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన పరీక్షలు సెప్టెంబర్ 8 వరకు అంటే వారం రోజులపాటు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 19 లక్షల 74వేల మంది హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 19 రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. 

అయితే పదిరోజుల అనంతరం పరీక్షా ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ఈ పరీక్షఫలితాల విడుదల కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాక మంత్రి బొత్స సత్యనారాయణ, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. 

గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30 నుంచి అక్టోబర్ 1 వరకు శిక్షణ ఇస్తారు. అనంతరం అక్టోబర్ 2 నుంచి ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్త మవుతుంది. 
"

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu