పశువులకు రెండో విడత మొబైల్ అంబులెన్స్‌లు: ప్రారంభించిన సీఎం జగన్

Published : Jan 25, 2023, 11:43 AM IST
పశువులకు  రెండో విడత  మొబైల్ అంబులెన్స్‌లు:  ప్రారంభించిన  సీఎం జగన్

సారాంశం

పశువులకు  మొబైల్ అంబులెన్స్ లను  ఏపీ ప్రభుత్వం  ప్రారంభించింది.  ఇవాళ  165 మొబైల్ అంబులెన్స్ లను  సీఎం జగన్  ప్రారంభించారు.  గతంలో  175 అంబులెన్స్ లను  ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.  


విజయవాడ: పశువులకు వైద్యం అందించే  మొబైల్ అంబులెన్స్ లను  ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు   తాడేపల్లిలో  ప్రారంభించారు.  గతంలో  తొలి విడతలో  175 అంబులెన్స్ లను  సీఎం జగన్  ప్రారంభించారు. రెండో విడత కింద  ఇవాళ  165 వాహనాలను  సీఎం జగన్ ప్రారంభించారు. మంత్రి  సిదిరి అప్పలరాజుతో  కలిసి  జెండా ఊపి  అంబులెన్స్ లను  సీఎం  జగన్ ప్రారంభించారు. అంబులెన్స్ ను సీఎం పరిశీలించారు.  అంబులెన్స్ లో  ఉన్న  సదుపాయాల గురించి  పశువైద్యాధికారులు  సీఎం జగన్ కు  వివరించారు.   

తొలివిడతలో  పశువులకు మొబైల్ అంబులెన్స్ లకు  రాష్ట్ర ప్రభుత్వం  రూ.129.07 కోట్లు  ఖర్చు చేసింది.   ఇవాళ  ప్రారంభించిన  165 అంబులెన్స్ లకు  రూ. 111 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. పశువులకు  అవసరమైన మందులు, వైద్యం చేసేందుకు  అవసరమైన పరికరాలు  ఈ అంబులెన్స్ లో  ఉంటాయి. తమ పశువులకు   వైద్య సహయం కోసం  ప్రభుత్వం ఏర్పాటు  చేసిన 155251 నెంబర్ కు ఫోన్  చేస్తే  అంబులెన్స్  పశువులకు  వైద్యం చేసేందుకు  ఆయా గ్రామాలకు  వెళ్తాయి.ప్రతి అంబులెన్స్ లో పశు వైద్యుడు,  సహా అతని సహాయకుడు  ఉంటారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu