నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి కానుక... పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్

Siva Kodati |  
Published : Oct 20, 2022, 09:25 PM IST
నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి కానుక... పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులకు దీపావళి కానుక ప్రకటించారు. 6,511 పోలీస్ నియామకాలకు ఆయన గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు దీపావళి కానుకను ప్రకటించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా వున్న 6,511 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఏపీ పోలీస్ శాఖలోని సివిల్ , రిజర్వ్ పోలీస్ విభాగాల్లోని 6,511 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 3,580 సివిల్ కానిస్టేబుల్స్, 315 ఎస్సై పోస్టులు వున్నాయి. ఇక రిజర్వ్ పోలీస్ విభాగానికి వస్తే... ఏపీపీఎస్సీలో 2,520 కానిస్టేబుల్ పోస్టులు, 96 ఎస్ఐ పోస్టులు భర్తీ కానున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్