వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు: పుష్ప శ్రీవాణి ప్రకటన

Published : Dec 28, 2020, 05:23 PM IST
వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు: పుష్ప శ్రీవాణి ప్రకటన

సారాంశం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వులు జారీ చేసింది. పుష్ప శ్రీవాణి ఆ విషయం చెప్పారు.

విజయవాడ: ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి  మాట్లాడుతూ, ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు. సీఎం జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి అన్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu