అప్పుడే కాన్వాయ్ మార్చిన జగన్.. నెలకే కొత్త కాన్వాయ్

Siva Kodati |  
Published : Jun 17, 2019, 10:15 AM IST
అప్పుడే కాన్వాయ్ మార్చిన జగన్.. నెలకే కొత్త కాన్వాయ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్‌ని నెల తిరక్కుండానే మార్చివేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక కాన్వాయ్‌ని సమకూర్చిన సంగతి తెలిసిందే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్‌ని నెల తిరక్కుండానే మార్చివేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక కాన్వాయ్‌ని సమకూర్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు ఆ కాన్వాయ్ స్థానంలో ఆరు కొత్త బ్లాక్ ఫార్చ్యూనర్ వాహనాలు వచ్చి చేరాయి. జగన్ భద్రత దృష్ట్యా ప్రభుత్వం కొత్తగా ఈ వాహనాలను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో పాత కాన్వాయ్‌ని హైదరాబాద్‌కు చేర్చారు.

ఇకపై జగన్ ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా ఇదే కాన్వాయ్‌ని ఉపయోగిస్తారు. ఇక కొత్త కాన్వాయ్‌లోని వాహనాలకు ఏపీ 39 పీఏ 2345 నెంబర్‌ను కేటాయించారు. 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స: పయ్యావుల కేశవ్| Asianet News Telugu