మోడీకి జగన్ లేఖ: 60 లక్షల కరోనా టీకాలు అందించాలని లేఖ

Published : Apr 16, 2021, 04:34 PM IST
మోడీకి జగన్ లేఖ: 60 లక్షల కరోనా  టీకాలు అందించాలని లేఖ

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్రమోడీకీ ఏపీ సీఎం జగన్  శుక్రవారంనాడు లేఖ రాశాడు.  రాష్ట్రానికి  మరో 60 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలని ఆ లేఖలో మోడీని కోరారు.

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీకీ ఏపీ సీఎం జగన్  శుక్రవారంనాడు లేఖ రాశాడు.  రాష్ట్రానికి  మరో 60 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలని ఆ లేఖలో మోడీని కోరారు.రాష్ట్రంలో  కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని  ఆయన తెలిపారు.  టీకా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్క రోజులోనే  6.28 లక్ష డోసుల వ్యాక్సిన్లు వేసిన విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు.

 మొదటి డోసు వేసుకొన్న 45 ఏళ్లు  పై బడినవారికి మరో మూడు వారాల్లో రెండో డోస్ ఇవ్వాల్సి ఉందని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. టీకా ఉత్సవానికి రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు  అందించినందకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్రంలో  కరోనా టీకాల కొరత నెలకొంది.  ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి సుమారు 5 లక్షల  కరోనా వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. 

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  ఈ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు గాను  ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది.   కరోనాపై  గురువారం నాడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.   ఫోన్ చేసిన మూడు గంటల్లోనే కరోనా రోగులకు బెడ్స్ అందించాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందిే.
 

PREV
click me!

Recommended Stories

Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu
Holiday : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు.. మీకు ఈ మెసేజ్ వచ్చిందో మళ్లీ సెలవే..!