రాహుల్ తో చంద్రబాబు భేటీ: బీజేపీ యేతర కూటమి కార్యచరణపై చర్చ

Published : Jan 22, 2019, 09:48 PM IST
రాహుల్ తో చంద్రబాబు భేటీ: బీజేపీ యేతర కూటమి కార్యచరణపై చర్చ

సారాంశం

కోల్‌కతాలో ఐక్యతా ర్యాలీ విజయవంతం అయిన అంశంపై కూడా చర్చించారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించబోయే సభపైనా రాహుల్ గాంధీతోనూ చంద్రబాబు చర్చించారు. 

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన ఆయన బీజేపీ యేతర కూటమి ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. 

కోల్‌కతాలో ఐక్యతా ర్యాలీ విజయవంతం అయిన అంశంపై కూడా చర్చించారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించబోయే సభపైనా రాహుల్ గాంధీతోనూ చంద్రబాబు చర్చించారు. 

అంతకు ముందు చంద్రబాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయిని కలిశారు. ఫిబ్రవరి 3న  ఏపీ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇకపోతే ఢిల్లీలో బుధవారం బీజేపీ యేతర పార్టీల సమావేశం జరగనుంది. 
 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna REddy Pressmeet: మీ ఆటలు సాగవు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్| Asianet News Telugu
Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్