తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్: చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు

Published : Dec 11, 2018, 04:36 PM IST
తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్: చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలు ఆడియాశలు అయ్యాయి. కనీసం తన మేనకోడలు నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసినిని గెలిపించుకుందామని ఆశపడ్డారు.   

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలు ఆడియాశలు అయ్యాయి. కనీసం తన మేనకోడలు నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసినిని గెలిపించుకుందామని ఆశపడ్డారు. 

కానీ ఆ ఆశ కూడా నెరవేర్చలేదు ఓటరు దేవుడు. దీంతో చంద్రబాబు నాయుడు డీలా పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఖంగుతిన్న చంద్రబాబు నాయుడు ఈనెల 13న విశాఖపర్యటనను రద్దు చేసుకున్నారు. 

వాస్తవానికి ఈనెల 13న విశాఖలోని పెద్ద గంట్యాడలో మెడిటెక్ జోన్ ను జాతికి అంకితం చేయాల్సి ఉంది. అలాగే తగరపువలసలో ఐ - హబ్ కు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల ప్రభావంతో చంద్రబాబు విశాఖపర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ | CM Chandrababu Inaugurates Quantum Reference Facility
AP Food Commission Chitha Vijay Prathap:జగన్ మోహన్ రెడ్డి గారే ఇవన్నీ పెట్టారు | Asianet News Telugu