అమరావతి భూ కుంభకోణం : మాజీ మంత్రి నారాయణకు షాక్.. ఏపీ సీఐడీ నోటీసులు, కుమార్తెలకు కూడా

By Siva KodatiFirst Published Feb 28, 2023, 5:43 PM IST
Highlights

అమరావతి భూముల కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కుమార్తెలు శరణి, సింధూరకు సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు ఇచ్చింది. 

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ సీఐడీ షాకిచ్చింది. అమరావతి భూముల కేసులో ఆయనకు మంగళవారం సీఐడీ నోటీసులు ఇచ్చింది. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీఐడీ .. మార్చి 6న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆయనతో పాటు నారాయణ సంస్థ ఉద్యోగి ప్రమీల, కుమార్తెలు శరణి, సింధూర.. అల్లుళ్లు పునీత్, వరుణ్‌లకు నోటీసులు ఇచ్చింది. వీరంతా మార్చి 7న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 
 

click me!