సుదీర్ఘంగా సాగిన జగన్ తొలి కేబినెట్ భేటీ: కీలక నిర్ణయాలకు ఆమోదం

Published : Jun 10, 2019, 04:34 PM IST
సుదీర్ఘంగా సాగిన జగన్ తొలి కేబినెట్ భేటీ: కీలక నిర్ణయాలకు ఆమోదం

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తొలి కేబినెట్ భేటీ ఆరు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.


అమరావతి:  ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తొలి కేబినెట్ భేటీ ఆరు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.

ఏపీ  మంత్రివర్గ సమావేశం సోమవారం నాడు అమరావతిలో జరిగింది.  ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించారు.ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన  తర్వాత అదే వేదికపై సామాజిక పెన్షన్లను  రూ.2250కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఆశా వర్కర్ల వేతనాలను రూ. 10వేలకు పెంచింది. ఇప్పటికే ఈ విషయమై వైఎస్ జగన్  హామీ ఇచ్చారు.ఈ  హామీని కేబినెట్ ర్యాటిఫికేషన్ చేసింది.

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ కమిటీ మూడు మాసాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. 

కేబినెట్‌ ఎజెండా కేవలం 8 అంశాలే ఉన్నాయి. కానీ టేబుల్ ఎజెండాగా 15 అంశాలు చర్చించారని సమాచారం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల వేతనాలను రూ. 400 నుండి రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 7265 లబ్ది పొందనుంది. సీపీఎస్ రద్దు విషయమై ఏపీ కేబినెట్ సానుకూలంగా స్పందించింది.

పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కేబినెట్‌లో చర్చించారు. 

PREV
click me!

Recommended Stories

రాజధాని అమరావతి లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Launches Quantum Reference
Minister Nara Lokesh: ప్రత్యేక ప్రతిభావంతులతో నారా లోకేష్ ఎమోషనల్ చిట్ చాట్ | Asianet News Telugu