తప్పు చేసినట్లు తేలితే జగన్ జైలుకెళ్లాల్సిందే: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 19, 2021, 02:52 PM IST
తప్పు చేసినట్లు తేలితే జగన్ జైలుకెళ్లాల్సిందే: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

చంద్రబాబు  తప్పు చేసుంటే తప్పకుండా శిక్షపడుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు జగన్ కేసుల్లో తప్పు చేసినట్లు తేలినా శిక్ష తప్పదని ఆయన తేల్చిచెప్పారు

చంద్రబాబు  తప్పు చేసుంటే తప్పకుండా శిక్షపడుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు జగన్ కేసుల్లో తప్పు చేసినట్లు తేలినా శిక్ష తప్పదని ఆయన తేల్చిచెప్పారు.

స్థానిక ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉంటుందని సోము వీర్రాజు తెలిపారు. కింది స్థాయిలో బీజేపీ- జనసేన బలంగా వుందని ఆయన పేర్కొన్నారు. 

సంక్షేమ పాలన చేస్తారని ప్రజలు అధికారమిస్తే వైసీపీ పరిపాలనను గాలికి వదిలేసిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ . ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత దోచుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టి అధికారాన్ని వ్యాపారంగా మార్చారని వీర్రాజు ఆరోపించారు.

పంచాయతీ బోర్డు మెంబర్‌ కోసం 51లక్షల ఖర్చు పెట్టే స్థాయికి వైసీపీ చేరిందన్న సోము వీర్రాజు.. ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటే జగన్ పార్టీని జనం కూకటి వేళ్లతో పెకిలిస్తారని హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు శోభ‌నం గ‌దిలో కూర్చున్న‌ట్లు కూర్చోవ‌డం ఏంటీ మాస్టారు.? గ‌రిక‌పాటి వివాదం ఏంటి, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారు.?
TTD కీల‌క నిర్ణ‌యం.. తిరుమ‌ల‌లో ఇ-టంగ్, ఇ-నోస్ టెక్నాల‌జీ. వీటి ఉప‌యోగం ఏంటంటే.?