నిమ్మల, అచ్చెన్నాయుడిపై ఫిర్యాదులు: రేపు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

By narsimha lodeFirst Published Dec 22, 2020, 2:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ  ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన  కమిటీ సమావేశం కానుంది. టీడీపీ శాసనసభపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై చర్చించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ  ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన  కమిటీ సమావేశం కానుంది. టీడీపీ శాసనసభపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై చర్చించే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభను తప్పుదోవ పట్టించే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని అధికారపక్షం ప్రివిలేజ్ మోషన్ పెట్టిన విషయం తెలిసిందే.ఈ ఫిర్యాదుల మేరకు ప్రివిలేజ్ కమిటీ రేపు అసెంబ్లీలో సమావేశం కానుంది. శాసనసభను అడ్డుకోవడంపై అచ్చెన్నాయుడిపై అధికారపక్షం ఫిర్యాదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం కానుంది. టీడీపీ శాసనసభపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై చర్చించే అవకాశం ఉంది. pic.twitter.com/uZklLm2pDq

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

సభను తప్పుదోవ పట్టించే విధంగా  నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారని సభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఏకంగా సీఎం జగన్ రామానాయుడిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నానని ఆయన ప్రకటించారు.ప్రివిలేజ్ కమిటీ రేపు సమావేశం కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొంది.

click me!