ఏపీలో కరోనా తగ్గుముఖం: శ్రీకాకుళంలో భారీగా కేసులు

Published : Jun 24, 2021, 05:04 PM ISTUpdated : Jun 24, 2021, 05:06 PM IST
ఏపీలో కరోనా తగ్గుముఖం: శ్రీకాకుళంలో భారీగా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 88,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4981మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,67,017కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,490కి చేరింది. 

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 88,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4981మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,67,017కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,490కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 6,464మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 లక్షల 4 వేల 844 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 49,688 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,14,49,636  కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో 283,చిత్తూరులో 854, తూర్పుగోదావరిలో943, గుంటూరులో267 కడపలో 238, కృష్ణాలో372, కర్నూల్ లో107, నెల్లూరులో 269, ప్రకాశంలో 380,విశాఖపట్టణంలో 115, శ్రీకాకుళంలో500, విజయనగరంలో 60, పశ్చిమగోదావరిలో 593కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో చిత్తూరులో పది మంది, తూర్పుగోదావరి, కష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురి చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళంలో, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురి చొప్పున చనిపోయారు. అనంతపురం, కడప, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,52,944 మరణాలు 1038
చిత్తూరు-2,16,538, మరణాలు1566
తూర్పుగోదావరి-2,58,543, మరణాలు 1105
గుంటూరు -1,60,649,మరణాలు 1067
కడప -1,05,138 మరణాలు 602
కృష్ణా -98,697,మరణాలు 1065
కర్నూల్ - 1,21,287,మరణాలు 811
నెల్లూరు -1,26,171,మరణాలు 900
ప్రకాశం -1,19,290, మరణాలు 903
శ్రీకాకుళం-1,17,805, మరణాలు 710
విశాఖపట్టణం -1,47,554, మరణాలు 1044
విజయనగరం -79,612, మరణాలు 648
పశ్చిమగోదావరి-1,58,799, మరణాలు 1016


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్