తూర్పుగోదావరిలో కరోనా ఉధృతి:ఏపీలో కరోనా తగ్గుముఖం

By narsimha lodeFirst Published Jun 25, 2021, 6:09 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 91,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,458 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,71,475కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,528కి చేరింది. 

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 91,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,458 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,71,475కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,528కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 6,313మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 లక్షల 11 వేల 157 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 47,790 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,15,41,485 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో 224,చిత్తూరులో 708, తూర్పుగోదావరిలో909, గుంటూరులో239,కడపలో 370, కృష్ణాలో331, కర్నూల్ లో126, నెల్లూరులో 212, ప్రకాశంలో 335,విశాఖపట్టణంలో 198, శ్రీకాకుళంలో151, విజయనగరంలో 64 పశ్చిమగోదావరిలో 591కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనాతో చిత్తూరులో 9 మంది, గుంటూరులోఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూల్, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరి చొప్పున మరణించారు.అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మృతి చెందారు.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,53,168 మరణాలు 1039
చిత్తూరు-2,17,246, మరణాలు1575
తూర్పుగోదావరి-2,59,452, మరణాలు 1109
గుంటూరు -1,60,888,మరణాలు 1072
కడప -1,05,508 మరణాలు 603
కృష్ణా -1,00,123,మరణాలు 1088
కర్నూల్ - 1,21,413,మరణాలు 813
నెల్లూరు -1,26,383,మరణాలు 901
ప్రకాశం -1,19,625, మరణాలు 903
శ్రీకాకుళం-1,17,956, మరణాలు 712
విశాఖపట్టణం -1,47,752, మరణాలు 1046
విజయనగరం -79,676, మరణాలు 650
పశ్చిమగోదావరి-1,59,390, మరణాలు 1017

 

: 25/06/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,68,580 పాజిటివ్ కేసు లకు గాను
*18,08,262 మంది డిశ్చార్జ్ కాగా
*12,528 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 47,790 pic.twitter.com/HW8bPRVtxq

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!