ఒకే రోజులో ఐదుగురు మృతి: ఏపీలో 9327కి చేరుకొన్న కరోనా కేసులు

Published : Jun 22, 2020, 04:35 PM IST
ఒకే రోజులో ఐదుగురు మృతి: ఏపీలో 9327కి చేరుకొన్న కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో  443  కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరుకొన్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో  443  కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో 16704 మంది శాంపిల్స్ పరీక్షిస్తే  392 మందికి కరోనా సోకింది. 83 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఒక్కరోజులో ఐదుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒక్కరు, కర్నూల్ లో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు, విశాఖపట్టణంలో ఒక్కరు మరణించారు. దీంతో ఈ వైరస్ మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 111కి చేరుకొంది.

 

also read:ఒక్క రోజులోనే అత్యధికం: ఏపీలో 8,929కి చేరిన కరోనా కేసులు

రాష్ట్రంలో అత్యధిక కేసుల్లో కర్నూల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 1354 కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. కృష్ణాలో 1063 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 1584 మందికి కరోనా సోకింది. ఇందులో 638 యాక్టివ్ కేసులు. కరోనా నుండి కోలుకొని 946 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.

విదేశాల నుండి  రాష్ట్రానికి వచ్చిన వారిలో 337 కేసులు నమోదయ్యాయి. ఇందులో 285 యాక్టివ్ గా ఉన్నాయి. 52 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.

PREV
click me!

Recommended Stories

ఒక టీచర్ వల్లనే నేను ఈస్థాయికి వచ్చాను.. | Nara Lokesh Honors Best SSC & Inter Students in AP
ఒక్కరైనా రాజకీయాల్లోకి రావాలి | Nara Lokesh Felicitates AP SSC & Inter Shining Stars| Asianet Telugu