24 గంటల్లో విజయనగరంలో అత్యల్పం, కృష్ణాలో అత్యధికం: ఏపీలో 8,81,948కి చేరిన కరోనా కేసులు

Published : Dec 30, 2020, 05:50 PM IST
24 గంటల్లో విజయనగరంలో అత్యల్పం, కృష్ణాలో అత్యధికం: ఏపీలో 8,81,948కి చేరిన కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 81వేల 948 కి చేరుకొన్నాయి.   

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 81వేల 948 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు.  చిత్తూరు,వైఎస్ఆర్ కడప, కృష్ణా , ప్రకాశం జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,104కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,17,64,418 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 55,740 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0349 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 71 వేల 588 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 3,256 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో 016,చిత్తూరులో 050,తూర్పుగోదావరిలో 028, గుంటూరులో 044, కడపలో 024, కృష్ణాలో 075, కర్నూల్ లో 007, నెల్లూరులో 009, ప్రకాశంలో 006, శ్రీకాకుళంలో 014, విశాఖపట్టణంలో 026, విజయనగరంలో 004,పశ్చిమగోదావరిలో 046 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,1323, మరణాలు 597
చిత్తూరు  -86,080,మరణాలు 841
తూర్పుగోదావరి -1,23,653, మరణాలు 636
గుంటూరు  -74,719, మరణాలు 664
కడప  -54,972, మరణాలు 460
కృష్ణా  -47,742,మరణాలు 666
కర్నూల్  -60,555, మరణాలు 487
నెల్లూరు -62,076 మరణాలు 505
ప్రకాశం -62,014 మరణాలు 579
శ్రీకాకుళం -45,938, మరణాలు 346
విశాఖపట్టణం  -59,134, మరణాలు 550
విజయనగరం  -41,014, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,833, మరణాలు 535

 

 

PREV
click me!

Recommended Stories

Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu
Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu