ఒక్క రోజులోనే కరోనాతో 11 మంది మృతి: ఏపీలో కరోనా డేంజర్ బెల్స్

Published : Apr 09, 2021, 05:38 PM IST
ఒక్క రోజులోనే కరోనాతో 11 మంది మృతి: ఏపీలో కరోనా డేంజర్ బెల్స్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో2,765 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 18వేల 597 కి చేరుకొన్నాయి. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో2,765 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 18వేల 597 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో పదకొండు మంది మరణించారు.  అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,279 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,53,65,743 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,892మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో1,245 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,245 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 94 వేల 896 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 16,422 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 167, చిత్తూరులో 496,తూర్పుగోదావరిలో 078,గుంటూరులో 490, కడపలో 171,కృష్ణాలో 341, కర్నూల్ లో 079, నెల్లూరులో 292,ప్రకాశంలో 161, శ్రీకాకుళంలో 100, విశాఖపట్టణంలో 335, విజయనగరంలో 049,పశ్చిమగోదావరిలో 006కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -69,198 మరణాలు 608
చిత్తూరు  -92,701మరణాలు 880
తూర్పుగోదావరి -1,25,665, మరణాలు 637
గుంటూరు  -81,015, మరణాలు 684
కడప  -56,550, మరణాలు 464
కృష్ణా  -52,233,మరణాలు 690
కర్నూల్  -62,576, మరణాలు 499
నెల్లూరు -64,690,మరణాలు 518
ప్రకాశం -63,346, మరణాలు 588
శ్రీకాకుళం -47,467,మరణాలు 347
విశాఖపట్టణం  -63,912,మరణాలు 584
విజయనగరం  -41,680, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,669, మరణాలు 542

 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu