తూ.గోదావరిలో కరోనా ఉధృతి:ఏపీలో 19,05,023కి చేరిన కోవిడ్ కేసులు

Published : Jul 05, 2021, 06:50 PM IST
తూ.గోదావరిలో కరోనా ఉధృతి:ఏపీలో  19,05,023కి చేరిన కోవిడ్ కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 72,731 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 2,100 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,05,023కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 26 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,870కి చేరింది.   

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 72,731 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 2,100 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,05,023కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 26 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,870కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 3,435మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 లక్షల 58 వేల 189 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 33,964 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,24,35,809 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో060,చిత్తూరులో 316, తూర్పుగోదావరిలో583, గుంటూరులో128,కడపలో 151, కృష్ణాలో114, కర్నూల్ లో050, నెల్లూరులో160, ప్రకాశంలో 176,విశాఖపట్టణంలో 075, శ్రీకాకుళంలో048, విజయనగరంలో 022, పశ్చిమగోదావరిలో 217కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో  26 మంది చనిపోయారు.కరోనాతో చిత్తూరు, కృష్ణాలో ఐదుగురి చొప్పున మరణించారు. తూర్పుగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరి చొప్పున చనిపోయారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మృతి చెందారు.   దీంతో  రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,870 కి చేరింది.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,54,525, మరణాలు 1058
చిత్తూరు-2,22,281, మరణాలు1635
తూర్పుగోదావరి-2,66,233, మరణాలు 1153
గుంటూరు -1,63,428,మరణాలు 1106
కడప -1,07,260, మరణాలు 612
కృష్ణా -1,02,96,మరణాలు 1137
కర్నూల్ - 1,22,272,మరణాలు 827
నెల్లూరు -1,28,422,మరణాలు 915
ప్రకాశం -1,22,774, మరణాలు 933
శ్రీకాకుళం-1,18,948, మరణాలు 741
విశాఖపట్టణం -1,49,198, మరణాలు 1059
విజయనగరం -80,542, మరణాలు 662
పశ్చిమగోదావరి-1,63,549, మరణాలు 1032


 

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu