ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు: మొత్తం 9,09,002కి చేరిక

Published : Apr 05, 2021, 05:04 PM IST
ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు: మొత్తం 9,09,002కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో1326 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 09వేల 002 కి చేరుకొన్నాయి.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో1326 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 09వేల 002 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు.కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు,గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,244 కి చేరుకొంది.రాష్ట్రంలో ఇప్పటివరకు 1,52,39,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 30,678 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో1326 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 911 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 91 వేల 048 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 10,710 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 023, చిత్తూరులో 282,తూర్పుగోదావరిలో 029,గుంటూరులో 271, కడపలో 031,కృష్ణాలో 138, కర్నూల్ లో 050, నెల్లూరులో 171,ప్రకాశంలో 054, శ్రీకాకుళంలో 052, విశాఖపట్టణంలో 222, విజయనగరంలో 002,పశ్చిమగోదావరిలో 001కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -68,627 మరణాలు 605
చిత్తూరు  -91,121,మరణాలు 873
తూర్పుగోదావరి -1,25,473, మరణాలు 636
గుంటూరు  -79,334, మరణాలు 681
కడప  -56,062, మరణాలు 464
కృష్ణా  -51,201,మరణాలు 687
కర్నూల్  -61,891, మరణాలు 495
నెల్లూరు -63,777,మరణాలు 514
ప్రకాశం -62,863, మరణాలు 584
శ్రీకాకుళం -46,957,మరణాలు 347
విశాఖపట్టణం  -62,731,మరణాలు 578
విజయనగరం  -41,489, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,581, మరణాలు 542

 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్