ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,85,937కి చేరిక

Published : Jan 11, 2021, 06:50 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,85,937కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 121 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 85వేల 037 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 121 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 85వేల 037 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. కృష్ణ, విశాఖపట్టణంలలో ఒక్కొక్కరు చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,131కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,23,55,607 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 30,933మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 213మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 213 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 75 వేల 456 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 2,450 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లోఅనంతపురంలో006, చిత్తూరులో 023,తూర్పుగోదావరిలో 024, గుంటూరులో 012 కడపలో 008, కృష్ణాలో 008, కర్నూల్ లో 006, నెల్లూరులో 009, ప్రకాశంలో 005, శ్రీకాకుళంలో 002, విశాఖపట్టణంలో 013 విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 005 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,510, మరణాలు 597
చిత్తూరు  -86,598,మరణాలు 845
తూర్పుగోదావరి -1,23,964 మరణాలు 636
గుంటూరు  -75,145 మరణాలు 667
కడప  -55,115, మరణాలు 461
కృష్ణా  -48,191,మరణాలు 672
కర్నూల్  -60,693, మరణాలు 487
నెల్లూరు -62,231మరణాలు 506
ప్రకాశం -62,091 మరణాలు 580
శ్రీకాకుళం -46,025, మరణాలు 347
విశాఖపట్టణం  -59,439, మరణాలు 556
విజయనగరం  -41,076, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,064, మరణాలు 539
 

 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu