తగ్గుతున్న కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8.54,011కి చేరిక

Published : Nov 15, 2020, 05:55 PM ISTUpdated : Nov 15, 2020, 10:13 PM IST
తగ్గుతున్న కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8.54,011కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1056 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 54వేల 011 కి చేరుకొన్నాయి.   


అమరావతి:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1056 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 54వేల 011 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 14మంది కరోనా మరణించారు.అనంతపురం, చిత్తూరు,కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల్లో ఇద్దరి చొప్పున  కరోనాతో మరణించారు. తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6868కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 91లక్షల 54వేల 263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  వీరిలో 1056మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో2,140 మందికి కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 28వేల 322 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 18,659 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 70,చిత్తూరులో 87,తూర్పుగోదావరిలో 139, గుంటూరులో 206, కడపలో 047, కృష్ణాలో 153, కర్నూల్ లో 027, నెల్లూరులో 030, ప్రకాశంలో 037, శ్రీకాకుళంలో 024, విశాఖపట్టణంలో 057, విజయనగరంలో 025,పశ్చిమగోదావరిలో 154 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,173, మరణాలు 580
చిత్తూరు  -82,062మరణాలు 808
తూర్పుగోదావరి -1,20,441, మరణాలు 625
గుంటూరు  -70,996, మరణాలు 638
కడప  -53615,మరణాలు 445
కృష్ణా  -43,197, మరణాలు 609
కర్నూల్  -59,942, మరణాలు 483
నెల్లూరు -60,884, మరణాలు 490
ప్రకాశం -60,951, మరణాలు 576
శ్రీకాకుళం -45,019, మరణాలు 344
విశాఖపట్టణం  -57,295, మరణాలు 525
విజయనగరం  -40,283,మరణాలు 232
పశ్చిమగోదావరి -90,258, మరణాలు 513


 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu