ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు: స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు

Published : Feb 21, 2024, 11:42 AM ISTUpdated : Feb 21, 2024, 11:53 AM IST
 ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు: స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు

సారాంశం

ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.

అమరావతి: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ  బుధవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై  ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను కోర్టు విన్నది.  బీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ చెప్పారు.

బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టుల భర్తీ విషయమై  మంగళవారం నాడు కూడ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ విషయమై  సుప్రీంకోర్టు తీర్పు కూడ భిన్నంగా ఉన్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.  అయితే ఈ విషయమై తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్