దీపావళి తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ సర్కార్ ప్లాన్

By narsimha lodeFirst Published Nov 3, 2020, 7:21 PM IST
Highlights

దీపావళి పర్వదినం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు  నిర్వహించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అమరావతి: దీపావళి పర్వదినం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు  నిర్వహించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఈ ఏడాది డిసెంబర్  14వ తేదీ లోపుగా  అసెంబ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి అనివార్యంగా నెలకొంది. దీంతో దీపావళి తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.

also read:నవంబర్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వారం రోజుల నిర్వహించే అవకాశం

నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.ఈ ఏడాది జూన్ 16న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.  ఈ నెల 5వ తేదీన కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. 

ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తినా కూడ సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.టీడీపీ నేతలు ప్రభుత్వంపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును టీడీపీ నాశనం చేసిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

 

click me!