AP Budget 2022: రూ. 2,56,256 కోట్ల‌తో ఏపీ బడ్జెట్‌.. శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

Published : Mar 11, 2022, 10:31 AM ISTUpdated : Mar 11, 2022, 12:08 PM IST
AP Budget 2022: రూ. 2,56,256 కోట్ల‌తో ఏపీ   బడ్జెట్‌.. శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 2,56,256 కోట్లతో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఆయన సభలో ప్రవేవశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 2,56,256 కోట్లతో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఆయన సభలో ప్రవేవశపెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,08,261 కోట్లు,  మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా, జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా ఉంది. ఈ సందర్భంగా బుగ్గన ప్రముఖ తమిళ కవి తిరువళ్వార్ కవితను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తోందని అన్నారు.

బడ్జెట్లో నవరత్నాలు, సంక్షేమానికి  పెద్ద పీట వేసినట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. వెనుకబడిన వర్గాల అభివృద్దికి రెండింతల కేటాయింపులు పెంచుతున్నట్టుగా చెప్పారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పలువురు ప్రముఖులు చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించిన బుగ్గన.. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని వివరించారు. 

విద్య, వైద్యంలో సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. పేదరికం తగ్గింపులో ఏపీ దేశంలో 5వ స్థానంలో ఉందన్నారు. నాడు-నేడులో భాగంగా స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచామని చెప్పారు. స్వయంసహాయక రంగాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సామాజిక భద్రత కింద వైఎస్సార్ పెన్షన్‌ రూ.2500 ఇస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలోనూ నగదు బదిలీ చేశామని చెప్పారు. పథకాల్లో మహిళలు, బాలికలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా వెల్లడించారు. కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. 

కేటాయింపులు ఇలా..కేటాయింపులు ఇలా..
విద్య రంగానికి- రూ.30,077 కోట్లు
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక- రూ. 18,000 కోట్లు 
వైఎస్సార్‌ రైతు భరోసా- రూ. 3,900 కోట్లు
పర్యావరణ, అటవీ శాఖ- రూ. 685.36 కోట్లు
పౌరసరఫరాలు రూ.3,719.24 కోట్లు
వ్యవసాయ రంగానికి- రూ. 11,387 కోట్లు
బీసీ సంక్షేమానికి- రూ. 20,962.06 కోట్లు
పశుసంవర్ధక శాఖకు- రూ. 1,568.83 కోట్లు
విద్యుత్ శాఖ- రూ. 10, 281. 04 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్- రూ. 27,706.66 కోట్లు
ఆర్థిక సేవల రంగానికి రూ. 69,306 కోట్లు
ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ రూ. 11,482 కోట్లు
గ్రామీణాభివృద్ది- రూ. 17,109 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ- రూ. 685 కోట్లు
ట్రాన్స్‌పోర్ట్-రూ. 9,617 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు- రూ. 13,630 కోట్లు
ఇంధన రంగానికి- రూ. 10,281 కోట్లు
జనరల్ ఎకో సర్వీసెస్- రూ. 4,420 కోట్ల కేటాయింపు
ఇండస్ట్రీ అండ్ మినరల్స్- రూ. 2,755.17 కోట్లు
వెనకబడిన వర్గాల అభివృద్దికి రూ. 20,962 కోట్లు
జగనన్న విద్య కానుక- రూ. 2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన- రూ. 2,083.32 కోట్లు
డ్వాక్రా (రూరల్) వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు- రూ. 600 కోట్లు
డ్వాక్రా (అర్బన్) వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు- రూ. 200 కోట్లు
వైఎస్సార్ పీఎం ఫసల్ భీమా యోజన- రూ.1.802 కోట్లు
ఈబీసీ నేస్తం- రూ.590 కోట్లు
వైఎస్సార్ ఆసరా- రూ.6400 కోట్లు
వైఎస్సార్ చేయూత- రూ.4,235.95 కోట్లు
జగనన్న అమ్మ ఒడికి-.6500 కోట్లు
కాపు నేస్తం పథకానికి- రూ.500 కోట్లు
వైఎస్సార్ జగనన్న చేదోడు- రూ.300 కోట్లు
వైఎస్సార్ వాహన మిత్ర- రూ.260 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం- రూ.199.99 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా- రూ.120.49 కోట్లు
ఆర్థిక సేవల రంగానికి- రూ.69,306 కోట్లు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు- రూ.10,201.60 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్- రూ.18,518 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్- రూ.6,145 కోట్లు
బీసీ సబ్ ప్లాన్- రూ.29,143 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్- రూ.3,532 కోట్లు
ఈబీసీల సంక్షేమం- రూ.6,639 కోట్లు కేటాయింపు
ర‌వాణా శాఖ‌కు రూ.9,617 కోట్లు
పరిశ్రమలు, ఖనిజాభివృద్ధికి రూ.2,755 కోట్లు
సాగునీరు, వ‌ర‌ద నివార‌ణ‌ల‌కు రూ.11,482 కోట్లు
శాస్త్ర సాంకేతికతకు, పర్యావరణానికి రూ.11.78 కోట్లు
వైద్య రంగానికి రూ.15,384 కోట్లు
ఉన్నత విద్య- రూ. 2,014.30 కోట్లు
కళలు, సంస్కృతుల కోసం- రూ.20.67కోట్లు
హౌసింగ్‌కు- రూ.4,791 కోట్లు
కార్మిక, ఉపాధికి- రూ.1,033 కోట్లు
సామాజిక భద్రత, సంక్షేమానికి- రూ.4,331 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులకు- రూ.140 కోట్లు
సాంకేతిక విద్యకు- రూ.413 కోట్లు
పట్టణాభివృద్ధికి- రూ.8,796 కోట్లు
తాగునీరు పారిశుధ్యానికి- రూ.2,133 కోట్లు
సంక్షేమ పథకాలకు- రూ.45,955 కోట్లు
సాధారణ సర్వీసులకు- రూ.73,609 కోట్లు
ఏపీ స్టేట్ క్రిష్టియన్ కార్పొరేషన్- రూ.113 కోట్లు
రెడ్డీ వెల్ఫేర్ కార్పొరేషన్- రూ.3,088 కోట్లు
కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్- రూ.1,899 కోట్లు
ఫైనాన్స్- రూ.58,538 కోట్లు
జీఏడీ- రూ.998 కోట్లు
సచివాలయ వ్యవస్థ- రూ.3,396 కోట్లు
సోషల్ వెల్ఫేర్- రూ.12,728 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ- రూ.8,581 కోట్లు
క్రీడా శాఖ- రూ.290 కోట్లు
హోంశాఖ- రూ.7,586 కోట్లు
కార్మిక శాఖకు- రూ.790 కోట్లు
న్యాయశాఖ- రూ.924 కోట్లు
మున్సిపల్ శాఖ- రూ.8,796 కోట్లు
మైనార్టీ శాఖ- రూ.2,063 కోట్లు
ఐటీ శాఖకు- రూ.212 కోట్లు

PREV
click me!

Recommended Stories

Botsa Satyanarayana Pressmeet: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ సెటైర్లు | Asianet Telugu
Indian Women’s Cricket Team Members Visit Narasimha Swamy Temple in Vizag | Asianet News Telugu