Anantapuram: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published : Dec 06, 2021, 11:23 AM ISTUpdated : Dec 06, 2021, 11:27 AM IST
Anantapuram: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.  

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద బొలెరో వాహనం ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, ఐదుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలు ఉన్నవారిని కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Demands: బస్సు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి టీడీపీ 20lakshs ఇవ్వాలి | Asianet News Telugu
Markapuram Bus Accident : ప్రమాదమని తెలిసినా..మార్కాపురం బస్సుఘటనలో తప్పెవరిది?| Asianet News Telugu