చిరంజీవి ఇంటి ముట్టడిపై జేఏసీ వివరణ ఇదీ: ఖబడ్దార్ అంటూ మెగా ఫ్యాన్స్

Published : Feb 29, 2020, 12:02 PM IST
చిరంజీవి ఇంటి ముట్టడిపై జేఏసీ వివరణ ఇదీ: ఖబడ్దార్ అంటూ మెగా ఫ్యాన్స్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపు ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై అమరావతి జేఏసీ స్పందించింది. దానిపై వివరణ ఇచ్చింది. కాగా, మెగాఫ్యాన్స్ చిరంజీవి నివాసానికి పెద్ద యెత్తున చేరుకుంటున్నారు.

హైదరాబాద్: మెగాస్టార్, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇంటిని ముట్టడికి ఇచ్చిన పిలుపుపై అమరావతి జేఎసీ స్పష్టత ఇచ్చింది. చిరంజీవి ఇంటి ముట్టడికి అమరావతి జేఎసీ పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే, చిరంజీవి ఇంటి ముట్టడికి తాము ఏ విధమైన పిలుపు ఇవ్వలేదని అమరావతి జేఏసీ స్పష్టం చేసింది. తాము పోస్టర్లు వేయలేదని చెప్పింది. అలా చేసినవాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని చెప్పింది. 

Also Read: అమరావతి సెగ.. చిరంజీవి నివాసం వద్ద భారీ భద్రత

చిరంజీవి ఇంటి వద్దకు పెద్ద యెత్తున మెగా ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. చిరంజీవి ఇంటిని ముట్టడిస్తే ఖబడ్దార్ అంటూ మెగా అభిమానులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటి వద్ద తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి జైకొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటి ముట్టడికి అమరావతి జేఎసీ పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండగా ఆయన సమర్థిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

విశాఖ పర్యటనలో జగన్ కోసం ఎగబడ్డ మహిళా అభిమానులు | YS Jagan Visits Visakhapatnam to Console Families
NTR: లోకేష్‌కి పోటీగా ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ.? జూలై 18న కీల‌క ప్ర‌క‌ట‌న ప్ర‌చారంపై క్లారిటీ వ‌చ్చేసింది