కాలభైరవ ఆలయంపై దాడి... రక్షణ కోసం మాజీ మంత్రి అఖిల ప్రియ హామీ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 22, 2020, 07:20 PM ISTUpdated : Sep 22, 2020, 08:05 PM IST
కాలభైరవ ఆలయంపై దాడి... రక్షణ కోసం మాజీ మంత్రి అఖిల ప్రియ హామీ (వీడియో)

సారాంశం

కాలభైరవ స్వామి గుడికి సీసీ కెమెరాలను సొంత ఖర్చుతో పెట్టిస్తానని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ హామీ ఇచ్చారు. 

కర్నూల్: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చిన్న కందుకూరు గ్రామంలోని కాలభైరవ స్వామి విగ్రహాన్ని పగలగొట్టాడం దురదృష్టకరమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. కాలభైరవ స్వామి గుడికి సీసీ కెమెరాలను సొంత ఖర్చుతో పెట్టిస్తానని మాజీ మంత్రి హామీ ఇచ్చారు. అన్ని దేవాలయాల్లో ప్రభుత్వమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 

''గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక చోట హిందూ ఆలయాలపై దాడులు జరగుతూనే ఉన్నాయి.  ఇలా దేవాలయాలపై దాడులు ఏ సీఎం హయాంలోనూ జరలేదు.  గుడిలోని దేవునికే రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? ఆలయాలపై దాడులు చేసే గ్యాంగ్ ను పట్టుకోవాలి. ప్రభుత్వానికి చేత కాకపోతే కేంద్రం ఒక టీంను ఏర్పాటు చేసి దాడులపై విచారణ జరిపించాలి'' అని డిమాండ్ చేశారు. 

వీడియో

''తిరుమల డిక్లరేషన్ పై మంత్రి కొడాలి నాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అన్ని కులాలను, మతాలను సీఎం గౌరవించాలి. అలా కాదని ఒకే కులంపై పక్షపాతంగా వ్యవహరించడం తగదు'' అని అఖిల ప్రియ అన్నారు. 

read more  వెండి సింహాల మాయం కేసు... ఆ నలుగురిని విచారిస్తున్న పోలీసులు

అంతర్వేది ఘటన మొదలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిరోజూ ఏదో ఒకచోట హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులోని శ్రీ భైరవ స్వామి గుడిలో కాలభైరవ స్వామి విగ్రహాన్ని ఎవరో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. 

ఇటీవల కృష్ణా జిల్లాలో ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అంతర్వేదిలో ఘటనను ఇంకా పూర్తి స్థాయిలో మరువక ముందే ఇలాంటి వరుస సంఘటనలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు ఈ దాడులను నిరిసిస్తూ నిరసన బాట పట్టాయి. ఇలా హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీ రాజకీయాలనూ వేడెక్కిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu