మంగంపేట బైరేటీస్‌లో బ్లాస్టింగ్‌తో అగ్రహరంలో బాలుడు మృతి: ఎన్ఎండీసీ కార్యాలయం ముందు ధర్నా

Published : Nov 17, 2022, 10:33 AM IST
 మంగంపేట  బైరేటీస్‌లో  బ్లాస్టింగ్‌తో  అగ్రహరంలో  బాలుడు  మృతి: ఎన్ఎండీసీ  కార్యాలయం  ముందు  ధర్నా

సారాంశం

అన్నమయ్య  జిల్లాలోని  ఓబులవారిపల్లెలో  విషాదం చోటు చేసుకుంది.  మంగంపేట  బైరెటీస్  లో  బ్లాస్టింగ్ తో  అగ్రహరం  గ్రామంలో  నాలుగేళ్ల   బాలుడు  మృతి  చెందాడు.  బాలుడి  మృతితో  అగ్రహరం గ్రామస్తులు  ఏపీఎన్ఎండీసీ  కార్యాలయం ముందు  ధర్నాకు  దిగారు.

చిత్తూరు: అన్నమయ్య జిల్లాలోని  ఓబులవారిపల్లెలో  విషాద  చోటు చేసుకుంది.  మంగంపేట  బైరెటీస్  లో  బ్లాస్టింగ్  తో పేలుడుతో  నాలుగేళ్ల బాలుడు  మృతి  చెందాడు.  ఈ  బ్లాస్టింగ్  పనులతో అగ్రహరం గ్రామంలో  ఓ  ఇంటి  గోడ కూలింది.  గోడ మీద పడి  నాలుగేళ్ల బాలుడు  మృతి  చెందాడు.  బాలుడి  మృతదేహంతో ఏపీఎన్ఎండీసీ  కార్యాలయం  ముందు  గ్రామస్తులు  ఆందోళనకు  దిగారు.  బ్లాస్టింగ్  ల  కారణంగా  తాము  తీవ్ర  ఇబ్బందులు పడుతున్నామని  అగ్రహరం  గ్రామస్తులు  చెబుతున్నారు. బ్లాస్టింగ్  లను  నిలిపివేయాలని  అగ్రహరం  గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee
ఎవర్ గ్రీన్ హీరో బాలయ్య చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన బాలయ్య | CM Chandrababu Speech | Balayya