మంగంపేట బైరేటీస్‌లో బ్లాస్టింగ్‌తో అగ్రహరంలో బాలుడు మృతి: ఎన్ఎండీసీ కార్యాలయం ముందు ధర్నా

By narsimha lodeFirst Published Nov 17, 2022, 10:33 AM IST
Highlights

అన్నమయ్య  జిల్లాలోని  ఓబులవారిపల్లెలో  విషాదం చోటు చేసుకుంది.  మంగంపేట  బైరెటీస్  లో  బ్లాస్టింగ్ తో  అగ్రహరం  గ్రామంలో  నాలుగేళ్ల   బాలుడు  మృతి  చెందాడు.  బాలుడి  మృతితో  అగ్రహరం గ్రామస్తులు  ఏపీఎన్ఎండీసీ  కార్యాలయం ముందు  ధర్నాకు  దిగారు.

చిత్తూరు: అన్నమయ్య జిల్లాలోని  ఓబులవారిపల్లెలో  విషాద  చోటు చేసుకుంది.  మంగంపేట  బైరెటీస్  లో  బ్లాస్టింగ్  తో పేలుడుతో  నాలుగేళ్ల బాలుడు  మృతి  చెందాడు.  ఈ  బ్లాస్టింగ్  పనులతో అగ్రహరం గ్రామంలో  ఓ  ఇంటి  గోడ కూలింది.  గోడ మీద పడి  నాలుగేళ్ల బాలుడు  మృతి  చెందాడు.  బాలుడి  మృతదేహంతో ఏపీఎన్ఎండీసీ  కార్యాలయం  ముందు  గ్రామస్తులు  ఆందోళనకు  దిగారు.  బ్లాస్టింగ్  ల  కారణంగా  తాము  తీవ్ర  ఇబ్బందులు పడుతున్నామని  అగ్రహరం  గ్రామస్తులు  చెబుతున్నారు. బ్లాస్టింగ్  లను  నిలిపివేయాలని  అగ్రహరం  గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 
 

click me!