మంత్రి రోజాపై నటుడు పృథ్వి హాట్ కామెంట్స్.. పవన్ కల్యాణ్ గెలవకపోతే ఏంటీ..?

Published : Feb 10, 2024, 12:45 PM IST
మంత్రి రోజాపై నటుడు పృథ్వి హాట్ కామెంట్స్.. పవన్ కల్యాణ్ గెలవకపోతే ఏంటీ..?

సారాంశం

వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమికి 136 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు నటుడు పృథ్వి.

అమరావతి : మంత్రి రోజాపై నటుడు పృథ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది నగరి స్థానమే అన్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, రెండుసార్లు ఓడిపోవడం వల్ల ఏమైనా నష్టం ఉందా అని ప్రశ్నించారు. తన దగ్గర ఓ బ్రౌన్ కలర్ డైరీ ఉందని.. అందులో ఏ ఎమ్మెల్యే ఎంతెంత సంపాదించారో నోట్ చేశానని చెప్పుకొచ్చారు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమికి 136 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. 21 పార్లమెంట్ స్థానాలు కూటమి గెలుచుకుంటుందని తెలిపారు. ఇప్పుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఏపీ లో చర్చనీయాంశంగా మారాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బియ్యం పురుగులు పడుతున్నాయి ఫుడ్ కమీషన్ చైర్మన్ సీరియస్ | AP State Food Commission Chairman
కర్నూలులో జగన్ మానియా.. కాన్వాయ్ వెనక పరుగులు తీసిన ఫ్యాన్స్ | YS Jagan Kurnool Tour | YSRCP