నెల్లూరు జిల్లాలో దారుణం: మైనర్ బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి, బాలిక పరిస్థితి విషమం

By narsimha lodeFirst Published Sep 5, 2022, 9:51 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నక్కలకాలలనీలో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు దుండగుడు. బాలిక ప్రతిఘటించడంతో  ఆమె గొంతు కోశాడు. అంతేకాదు యాసిడ్ దాడి చేశాడు. 

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నక్కలకాలనీలో బాలిక గొంతు కోసి యాసిడ్ పోశాడు దుండగుడు.  బాలిక పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.  బాలికపై  అత్యాచారయత్నం చేయడంతో బాలిక ప్రతిఘటించింది.

దీంతో  దుండగుడు బాలిక గొంతు కోసి ఆ తర్వాత యాసిడ్ పోశాడని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది. అయితే  విద్యార్ధినిపై  యాసిడ్ పోసి  గొంతు కోయడానికి కారణాలు తెలియాల్సి ఉందని మరో తెలుగు న్యూస్ చానెల్  టీవీ 9 కథనం ప్రసారం చేసింది. బాలిక గొంతు కోసిన ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.  ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

click me!