విశాఖ, విజయనగరం జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

Siva Kodati |  
Published : Jul 20, 2021, 03:48 PM IST
విశాఖ, విజయనగరం జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

సారాంశం

పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ప్రతిపనికి డబ్బులు  వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖ, విజయనగరం జిల్లాల్లోని  తహసీల్దార్ కార్యాలయాల్లో దాడులు చేసింది. 

విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసింది ఏసీబీ. పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ప్రతిపనికి డబ్బులు  వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది ఏసీబీ. 12 గంటలకు మొదలైన ఆకస్మిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో విశాఖ రూరల్, అర్బన్, అచ్యుతాపురం, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభ మండల కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలో పూసపాటి  రేగ, శృంగవరపు కోట, జామి, కొత్తవలస, భోగాపురం, డెంకాడ మండలాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్