ఏపీలోగ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలకు తాత్కాలిక బ్రేక్.. కారణమిదే..!

Published : Dec 01, 2022, 02:43 PM IST
ఏపీలోగ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలకు తాత్కాలిక బ్రేక్.. కారణమిదే..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో ఆధార్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో ఆధార్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సాఫ్ట్ వేర్ సంబంధిత సాంకేతిక సమస్య కారణంగా ఆధార్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను పునరుద్దరించడానికి సమయం పడుతుందని అంటున్నారు. అయితే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం ఈ సేవలను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. 

ఇక, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం పలు గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్, ఆధార్ కార్డులో చిరునామా  మార్పు వంటి.. తదితర సేవలను గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే