కొత్తగా 8,702 మందికి కరోనా: ఏపీలో 6 లక్షలు దాటిన కేసులు

Siva Kodati |  
Published : Sep 17, 2020, 06:52 PM ISTUpdated : Sep 17, 2020, 06:55 PM IST
కొత్తగా 8,702 మందికి కరోనా: ఏపీలో 6 లక్షలు దాటిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,702 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,702 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరింది.

నిన్న ఒక్క రోజే వైరస్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 5,177కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 10,712 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,08,088కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 88,187 యాక్టివ్ కేసులున్నాయి.

నిన్న ఒక్కరోజే 77,492 మంది శాంపిల్స్ పరీక్షించడంతో ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 48,84,371కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 545, చిత్తూరు 905, తూర్పు గోదావరి 1,383, గుంటూరు 550, కడప 637, కృష్ణ 367, కర్నూలు 394, నెల్లూరు 610, ప్రకాశం 705, శ్రీకాకుళం 567, విశాఖపట్నం 449, విజయనగరం 526, పశ్చిమ గోదావరిలలో 1064 కేసులు నమోదయ్యాయి.

అలాగే నిన్న ఒక్క రోజే చిత్తూరు 12, ప్రకాశం 10, కడప 7, గుంటూరు 6, కర్నూలు 6, నెల్లూరు 6, తూర్పుగోదావరి 5, కృష్ణ 5, అనంతపురం 4, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి 4, శ్రీకాకుళం 2, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు. 


 

 

 

PREV
click me!

Recommended Stories

Anganwadi THR || Food Commission Chairman Inspection in Anganwadi Center | Asianet News Telugu
ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్