కొత్తగా 7,553 మందికి కరోనా: ఏపీలో 6,39,302కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Sep 22, 2020, 06:13 PM IST
కొత్తగా 7,553 మందికి కరోనా: ఏపీలో 6,39,302కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో కరోనా జోరు కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,553 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 6,39,302కి చేరుకుంది

ఏపీలో కరోనా జోరు కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,553 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 6,39,302కి చేరుకుంది.

అనంతపురం 309, చిత్తూరు 902, తూర్పు గోదావరి 1,166, గుంటూరు 606, కడప 589, కృష్ణ 344, కర్నూలు 272, నెల్లూరు 556, ప్రకాశం 672, శ్రీకాకుళం 347, విశాఖపట్నం 410, విజయనగరం 391, పశ్చిమ గోదావరిలలో 989 కేసులు నమోదయ్యాయి.

గత 24 కోవిడ్ కారణంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 5,461కి చేరుకుంది. చిత్తూరు 8, అనంతపురం 6, విశాఖపట్నం 6, కృష్ణ 5, ప్రకాశం 5, తూర్పు గోదావరి 4, కర్నూలు 4, గుంటూరు 3, కడప 3, నెల్లూరు 3, పశ్చిమ గోదావరి 3, శ్రీకాకుళంలలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

ప్రస్తుతం ఏపీలో యాక్టీవ్ కేసుల సంఖ్య 71,465. నిన్న ఒక్కరోజే 10,555 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,62,376కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 68,829 శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 52,29,529కి చేరుకుంది.

 

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

జై శ్రీరామ్ నామ స్మరణతో దద్దరిల్లిన ఒంటిమిట్ట | Ontimitta Kodanda Rama Kalyanam | Asianet Telugu
ఏపీ రాజధాని మావిగన్ జగన్ ఇలా ఎందుకన్నారు? | YS Jagan Pressmeet | Asianet News Telugu