కొత్తగా 534 మందికి పాజిటివ్: ఏపీలో 8,77,348కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Dec 17, 2020, 05:27 PM IST
కొత్తగా 534 మందికి పాజిటివ్: ఏపీలో 8,77,348కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 534 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,77,348కి చేరింది.

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 534 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,77,348కి చేరింది.

నిన్న ఒక్కరోజు కోవిడ్ కారణంగా ఇద్దరు మరణించంతో మొత్తం మృతుల సంఖ్య 7,069కి చేరింది. గడిచిన 24 గంటల్లో 498 మంది ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,65,825కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 4454 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 63,821 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయడంతో ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 1,10,65,297కి చేరింది.

అనంతపురం 16, చిత్తూరు 130, తూర్పుగోదావరి 45, గుంటూరు 54, వైఎస్సార్ కడప 27, కృష్ణ 74, కర్నూలు 13, నెల్లూరు 21, ప్రకాశం 19, శ్రీకాకుళం 39, విశాఖపట్నం 31, విజయనగరం 14, పశ్చిమ గోదావరిలలో 51 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల అనంతపురం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

సినిమా రేంజ్ లో జగన్‌ మాస్ ఎంట్రీ | YS Jagan Visits Devarapalli Tobacco Procurement Centre
ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli