నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-50

Siva Kodati |  
Published : Dec 17, 2020, 03:52 PM IST
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-50

సారాంశం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీఎస్ఎల్వీ సీ-50ని అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్ 01ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీఎస్ఎల్వీ సీ-50ని అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్ 01ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం సరిగ్గా 3.41 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.  మొత్తం ఏడేళ్ల పాటు కక్షలో తిరగనున్న ఈ శాటిలైట్ బరువు మొత్తం 1410 కిలోలు..

పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది. రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే
ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu