బ్రేకింగ్: విశాఖ యారాడ బీచ్‌లో నలుగురి గల్లంతు

Siva Kodati |  
Published : Aug 30, 2020, 07:12 PM IST
బ్రేకింగ్: విశాఖ యారాడ బీచ్‌లో నలుగురి గల్లంతు

సారాంశం

విశాఖలో విషాదం చోటు చేసుకుంది. యారాడ బీచ్‌కు విహారయాత్ర కోసం వచ్చిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. 

విశాఖలో విషాదం చోటు చేసుకుంది. యారాడ బీచ్‌కు విహారయాత్ర కోసం వచ్చిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. దీనిని గమనించిన కొందరు గజ ఈతగాళ్లు వెంటనే సముద్రంలోకి దూకి ముగ్గురిని కాపాడారు. మరో వ్యక్తి ఆచూకీ దొరకలేదు.

గల్లంతైన వ్యక్తిని గొంతేసిపాలెంకి చెందిన వారిగా తెలుస్తోంది. యారాడ బీచ్ సాధారణంగానే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దీనికి తోడు వర్షా కాలం కావడంతో లోతు మరింత పెరిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు  తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy: చరిత్రహీనులకు ప్రజలే చరమగీతం పాడుతారు: పార్థసారథి| Asianet Telugu
పూరీల మెషిన్ కోసం స్పాట్ లోనే డబ్బులు ఇచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu