ఏపీలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న కరోనా: కొత్తగా 10,603 కేసులు, 88 మరణాలు

Siva Kodati |  
Published : Aug 30, 2020, 06:03 PM ISTUpdated : Aug 30, 2020, 09:54 PM IST
ఏపీలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న కరోనా: కొత్తగా 10,603 కేసులు, 88 మరణాలు

సారాంశం

ఏపీలో కరోనా కేసులు జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,603 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఏపీలో కరోనా కేసులు జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,603 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,767కి చేరింది.

గత 24 గంటల్లో వైరస్ కారణంగా 88 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3,884కి చేరుకుంది. నిన్న 63,077 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 36,66,422కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 9,067 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,21,754కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 99,129 యాక్టివ్ కేసులున్నాయి.

కోవిడ్ కారణంగా నెల్లూరు 14, చిత్తూరు 12, కడప 9, అనంతపురం 7, పశ్చిమ గోదావరి 7, తూర్పు గోదావరి 6, శ్రీకాకుళం 6, కృష్ణ 5, కర్నూలు 5, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, విశాఖపట్నంలలో నలుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజే అనంతపురం 695, చిత్తూరు 948, తూర్పు గోదావరి 1090, గుంటూరు 593, కడప 952, కృష్ణ 383, కర్నూలు 811, నెల్లూరు 1028, ప్రకాశం 881, శ్రీకాకుళం 819, విశాఖపట్నం 866, విజయనగరం 558, పశ్చిమ గోదావరిలలో 979 కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu