ఏపీలో కొత్తగా 396 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 566 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,222 మంది చికిత్స పొందుతున్నారు
ఆంధ్రప్రదేశ్లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో కొత్తగా 396 మందికి పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,60,282కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,339కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 566 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్ల సంఖ్య 20,40,721 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 40,855 మంది శాంపిల్స్ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,92,26,511 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,222 మంది చికిత్స పొందుతున్నారు.
నిన్న ఒక్కరోజు అనంతపురం 5, చిత్తూరు 94,, తూర్పుగోదావరి 33, గుంటూరు 61, కడప 11, కృష్ణ 56, కర్నూలు 4, నెల్లూరు 19, ప్రకాశం 20, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 34, విజయనగరం 12, పశ్చిమ గోదావరిలలో 32 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
: 23/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,60,282 పాజిటివ్ కేసు లకు గాను
*20,40,721 మంది డిశ్చార్జ్ కాగా
*14,339 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,222 pic.twitter.com/tQ1yAI77JX