ఏపీ : తూ.గోలో అనూహ్య పెరుగుదల.. నిన్న మూడే కేసులు, ఒక్కరోజులో 386 మందికి కరోనా

Siva Kodati |  
Published : Jul 28, 2021, 06:36 PM IST
ఏపీ  : తూ.గోలో అనూహ్య పెరుగుదల.. నిన్న మూడే కేసులు, ఒక్కరోజులో 386 మందికి కరోనా

సారాంశం

ఏపీలో కొత్తగా 2,010 కరోనా కేసులు నమోదవ్వగా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,956 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,999 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,010 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,57,047కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,312కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 3, ప్రకాశం 5, పశ్చిమ గోదావరి 2, కృష్ణ 4, గుంటూరు 1, కడప 1, కర్నూలు 1,  శ్రీకాకుళం 1, నెల్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,956 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,22,736కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 70,695 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,43,24,626కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,999 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 70, చిత్తూరు 220, తూర్పుగోదావరి 386, గుంటూరు 170, కడప 142, కృష్ణ 293, కర్నూలు 10, నెల్లూరు 206, ప్రకాశం 216, శ్రీకాకుళం 46, విశాఖపట్నం 120, విజయనగరం 25, పశ్చిమ గోదావరిలలో 106 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.  

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్