ఎపి ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు: రెండు బోగీలు అగ్నికి ఆహుతి

Published : May 21, 2018, 01:30 PM ISTUpdated : May 21, 2018, 01:36 PM IST
ఎపి ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు: రెండు బోగీలు అగ్నికి ఆహుతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు మంటల్లో చిక్కుకుంది. రెండు కోచ్ లు దగ్ధమయ్యాయి.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు మంటల్లో చిక్కుకుంది. రెండు కోచ్ లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరో బోగీకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ప్రాణనష్టమేదీ జరగలేదని సమాచారం. ఎయిర్ కండీషన్ కోచ్ ల డోర్స్ నుంచి మటలు బయటకు రావడాన్ని ఒకతను గుర్తించాదు. బి6, బి7 కోచ్ లు మంటల్లో చిక్కుకున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. 

ఢిల్లీ నుంచి రైలు 6 గంటలకు బయలుదేరింది. హైటెన్షన్ వైర్లు తెగిపడడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రెండు బోగీలను విడదీసి, ఆ బోగీల్లోని ప్రయాణికులను ఇతర బోగీలకు పంపించి, రైలును ముందుకు నడిపించినట్లు తెలుస్తోంది. రైలులో ఎక్కువగా తెలుగు ప్రయాణికులే ఉన్నారు. కొత్తగా రెండు బోగీలను రైలుకు జోడించినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

వైసీపీకి సన్స్ స్ట్రోక్...కొడుకులు ఏం చేసినా సమర్థించుకుంటారా? | Jogi Ramesh Family Controversy
AP Minister: వైసీపీకి ఈసారి 11 సీట్లు కూడా రావు.. డీఎస్సీ వివాదంపై ఏపీ మంత్రి పవర్ ఫుల్ వార్నింగ్